కుల్దీప్‌ విజృంభణ.. విండీస్‌ ఎదురీత

6 Oct, 2018 13:51 IST|Sakshi

రాజ్‌కోట్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ కష్టాల్లో పడింది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడుతున్న విండీస్‌ 151 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. అంతకుముందు 94/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్‌ 181 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో విండీస్‌ ఫాలోఆన్‌ ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ మరోసారి తడబడింది.

ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో కీలక వికెట్లను చేజార్చుకుంది. విండీస్‌ తొలి వికెట్‌ను అశ్విన్‌ తీయగా, ఆపై ఐదు వికెట్లను కుల్దీప్‌ యాదవ్‌ సాధించాడు. కుల్దీప్‌ యాదవ్‌ విజృంభణకు విండీస్‌ బ్యాట్స్‌మన్‌ విలవిల్లాడుతున్నారు. షాయ్‌ హోప్‌(17), హెట్‌మెయిర్‌(11), అంబ్రిస్‌(0), రోస్టన్‌ ఛేజ్‌(20), కీరన్‌ పావెల్‌(83)లు కుల్దీప్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరారు.  ఇంకా విండీస్‌ 317 పరుగుల వెనుకబడి ఉంది. భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను  649/9 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

విండీస్‌కు తప్పని ఫాలోఆన్‌

మరిన్ని వార్తలు