రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు:ముద్గల్ కమిటీ

17 Nov, 2014 16:38 IST|Sakshi
రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు:ముద్గల్ కమిటీ

న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు కొనసాగించినట్లు ముద్గల్ కమిటీ తేల్చింది. దీంతో పాటు క్రికెట్ అడ్మినిస్టేటర్ సుందర రామన్ కు కూడా బుకీలతో సంబంధాలున్నట్లు స్పష్టం చేసింది. ఓ బుకీకి సుందర రామన్ ఎనిమిదిసార్లు ఫోన్ చేసినట్లు ఆధారాలు లభించాయని ముద్గల్ కమిటీ పేర్కొంది.

 

అయితే బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ తో పాటు అతని మేనల్లుడు గురునాథన్ మెయప్పన్ లకు క్లీన్ చిట్ లభించింది. ఆ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి మెయప్పన్ లపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కమిటీ పేర్కొంది. ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు