రంజీ ఫైనల్‌కు ‘స్పోర్టింగ్’ పిచ్

26 Jan, 2014 00:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య 29 నుంచి జరిగే రంజీట్రోఫీ ఫైనల్ కోసం ఉప్పల్ స్టేడియంలో రెండు పిచ్‌లు సిద్ధం చేస్తున్నారు.
 
 ఈ రెండు వికెట్లను బీసీసీఐ పిచ్‌ల కమిటీ చీఫ్ దల్జీత్ సింగ్, సౌత్‌జోన్ క్యూరేటర్ విశ్వనాథన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ కోసం స్పోర్టింగ్ వికెట్లు తయారుచేసినట్లు హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. రెండు వికెట్లలో దేనిమీద మ్యాచ్ ఆడిస్తారనేది 27న నిర్ణయిస్తారు.
 

మరిన్ని వార్తలు