‘మ్యాచ్‌ విన్నర్లలో అతనిదే టాప్‌ ప్లేస్‌’

27 Jul, 2019 10:56 IST|Sakshi

ముంబై: శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత 50 ఓవర్ల ఫార్మెట్‌కు మలింగ వీడ్కోలు ప్రకటించాడు. మలింగ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. (ఇక్కడ చదవండి: అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!)
 
‘గత దశాబ్ద కాలంలో ముంబై ఇండియన్ తరపున ఒక మ్యాచ్ విన్నర్‌ను ఎంపిక చేయమంటే.. మలింగ ముందు వరుసలో ఉంటాడు. ఓ కెప్టెన్‌గా ఉత్కంఠ పరిస్థితుల్లో తేలిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి మలింగనే కారణం. భవిష్యత్తులో మలింగ‌కు మరింత మంచి జరగాలి’ అంటూ ట్వీట్ చేశాడు. (ఇక్కడ చదవండి: మలింగకు ఘనంగా వీడ్కోలు)

మరిన్ని వార్తలు