సచిన్ ‘గ్రామ్ యోజన’

17 Oct, 2014 07:04 IST|Sakshi
సచిన్ ‘గ్రామ్ యోజన’

ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మాస్టర్

న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్’ను దిగ్విజయంగా పూర్తి చేసిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని యోచిస్తున్నాడు. భార్య అంజలితో కలిసి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో తన మనసులోని ఆలోచనను మాస్టర్ బయటపెట్టాడు. మరికొంత మందిని ఆహ్వానించడం ద్వారా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు.

పాఠశాలలు, కాలేజిల్లో క్రీడల అభివృద్ధిపై దృష్టిపెడతానని తెలిపాడు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాభివృద్ధికి సచిన్ తన రాజ్యసభ నిధుల నుంచి రూ.3.5 కోట్లు కేటాయించాడు. ఈ గ్రామంలో జరుగుతున్న పనుల గురించి మోదీతో చర్చించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు