సైనా ఆశలు సజీవం, పోరాడి ఓడిన సింధు

18 Jun, 2014 15:37 IST|Sakshi
సైనా ఆశలు సజీవం, పోరాడి ఓడిన సింధు
జకర్తా: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నిలో భారత బాడ్నింటన్ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ మినహాయించి అందరూ ఇంటిదారి పట్టారు.
 
ఇస్టోరా గెలోరా బంగ్ కర్నో స్టేడియంలో జరిగిన పోటీలలో పీవీ సింధు, కే.శ్రీకాంత్, పారుపల్లి కాశ్యప్ లు ఓటమి పాలయ్యారు. ఈ టోర్ని ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నేహ్వాల్ పోటిలో ముందుకు దూసుకెళ్లింది. 
 
ధాయ్ లాండ్ ఆటగాడు పోర్నిప్ బురానాప్రసెర్ట్స్ పై 21-15, 21-10 తేడాతో విజయం సాధించారు. మరోపోటిలో చైనా మూడో ర్యాంక్ క్రీడాకారిణి యివాన్ వాంగ్ చేతిలో పోరాడి సింధు ఓడారు.
 
శ్రీకాంత్ పై చెన్ యెకున్  21-12, 17-21, 21-16 తేడాతో విజయం సాధించారు. డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప ఇండోనేషియా ఆటగాళ్లతో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. ఇండోనేషియా టోర్ని బహుమతి విలువ 750,000 డాలర్లు.
మరిన్ని వార్తలు