టైటిల్‌ పోరుకు సంజన సిరిమల్ల

30 Nov, 2019 10:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–4 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి సంజన సిరిమల్ల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సంజన బాలికల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది.

శుక్రవారం బాలికల సింగిల్స్‌ సెమీస్‌లో సంజన 6–1, 3–6, 6–1తో ఐదో సీడ్‌ సలాక్‌థిప్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందింది. మరో సెమీస్‌లో మూడో సీడ్‌ లాన్‌లనా (థాయ్‌లాండ్‌) 6–3, 6–4తో ఆరోసీడ్‌ మెయ్‌ హసెగవా (జపాన్‌)పై గెలుపొంది సంజనతో టైటిల్‌పోరుకు సిద్ధమైంది.   

మరిన్ని వార్తలు