న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల హవా నడుస్తోంది. ‘లండన్ ఒలింపియన్’ శివ థాపా సహా మొత్తం ఐదుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జోర్డాన్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో దేవేంద్రో సింగ్ (49 కేజీ), మనోజ్ కుమార్ (64 కేజీ), మన్దీప్ జాంగ్రా (69 కేజీ), సుఖ్దీప్ సింగ్ (75 కేజీ)లు క్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యారు.
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ (2012) ఈవెంట్లో చాంపియన్ అయిన శివ థాపా... లి యెన్ (చైనా)పై గెలుపొందగా, దేవేంద్రో సింగ్కు ప్రిక్వార్టర్ ఫైనల్లో బై లభించింది. తదుపరి క్వార్టర్స్ పోటీల్లో కైరట్ యెరలియెవ్ (కజకిస్థాన్)తో శివ థాపా, నొదిర్జొన్ మిర్జాక్మెదొవ్ (ఉజ్బెకిస్థాన్)తో దేవేంద్రో పోటీ పడతారు. కాగా మదన్లాల్ (52 కేజీ), వికాస్ (లైట్ వెయిట్), సతీశ్ (ప్లస్ 91 కేజీ), దినేశ్ కుమార్ (91 కేజీ)లకు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది.