శ్రీలంక ఓపెనర్లు అవుట్

13 Aug, 2017 14:05 IST|Sakshi

పల్లెకెలె:భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా ఆదివారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.  ఉపల్ తరంగా(5), దిముత్ కరుణరత్నే(4)లు పెవిలియన్ చేరారు. భారత పేసర్ మొహ్మద్ షమీ బౌలింగ్ లో వారిద్దరూ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దాంతో 23 పరుగుల వద్ద లంక రెండు వికెట్లను నష్టపోయింది.

అంతకుముందు భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 487 ఆలౌటైన సంగతి తెలిసిందే. 329/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన విరాట్ సేన.. మరో 158 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది.  హార్దిక్ పాండ్యా 96 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 108 పరుగులు సాధించి చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. భారత్ ఇన్నింగ్స్ లో శిఖర్ ధావన్(119) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు