స్టీవెన్ స్మిత్ సెంచరీ

19 Dec, 2014 09:39 IST|Sakshi
స్టీవెన్ స్మిత్ సెంచరీ

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీ చేశాడు.  భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 86 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 387 పరుగులతో ఆట కొనసాగిస్తోంది.  221/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 232 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.  247 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

మిషెల్ మార్ష్(11) ఐదో వికెట్గా అవుటయ్యాడు. మార్ష్ను ఇషాంత్ శర్మ పెవిలియన్కు పంపాడు. స్టీవెన్ స్మిత్(125), జాన్సన్(88) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.   తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులకు ఆలౌటయింది.
**

మరిన్ని వార్తలు