రెచ్చిపోయిన రైనా

1 Feb, 2017 22:46 IST|Sakshi
రెచ్చిపోయిన రైనా

బెంగళూరు: ఇంగ్లండ్తో చివరి, మూడో టి-20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మన్ సురేష్ రైనా (45 బంతుల్లో 63) రెచ్చిపోయాడు. రైనా 39 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ సేన 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. రైనా అవుటయ్యాక యువరాజ్ బ్యాటింగ్కు దిగాడు. ధోనీ (25) క్రీజులో ఉన్నాడు.  

ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ 2 పరుగులకే అవుటయినా రైనా ఆదుకున్నాడు. మరో ఓపెనర్ రాహుల్‌ (22)తో కలసి రైనా రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. కోహ్లీ రనౌటవగా, రాహుల్.. స్టోక్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. రైనా.. ప్లంకెట్ ఓవర్లో క్యాచవుటయ్యాడు.

మరిన్ని వార్తలు