సానియా మీర్జాకు కేసీఆర్ అభినందనలు

2 Nov, 2015 00:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిలకడగా అత్యున్నత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ఒకే ఏడాదిలో పది టైటిల్స్ గెలవడం అసాధారణ విషయమని కొనియాడారు. భవిష్యత్‌లో సానియా మీర్జా మరిన్ని టైటిల్స్ నెగ్గి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు