తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ స్కోర్ : 311/4

17 Dec, 2014 14:17 IST|Sakshi

బ్రిస్బెన్:  భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ దూకుడుగా ఆడింది. రెహానే 75, రోహిత్ శర్మ 26 పరుగులతో నాటౌట్గా క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ విజయ్ మురళీ 144, శిఖర్ థావన్ 24, పుజరా 18, కోహ్లీ 19  పరుగులు చేశారు. మరోవైపు బ్రిస్బేన్లో భారత ఆటగాళ్లను కట్టడి చేసేందుకు ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఏకంగా ఎనిమిది మంతితో బౌలింగ్ చేయించటం విశేషం.

మరిన్ని వార్తలు