లాతూర్‌లో విషాదం : ఏడుగురి మృతి

31 Jan, 2017 06:54 IST|Sakshi

లాతూర్‌ : మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. లాతూర్‌లోని ఓ పరిశ్రమలో విషవాయువులు పీల్చి ఏడుగురు కార్మికులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు.

లాతూర్‌ పారిశ్రామికవాడలోని కీర్తి ఆయిల్ మిల్‌లో ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా విషవాయువులు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు