పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కారు

28 Mar, 2015 02:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గుట్కా, ఖైనీ, జర్దాతో పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ఢిల్లీ సర్కారు నిషేధం విధించింది. ఢిల్లీలో  పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు