పెద్దపల్లి జిల్లాలో కార్డన్‌సెర్చ్

5 Dec, 2016 17:20 IST|Sakshi

ధర్మారం : పెద్దపల్లి జిల్లాలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. ధర్మారం మండలం బంజేరుపల్లి సీఐ మహేశ్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తయారు చేస్తున్న 5 లీటర్ల గుడుంబా, 60 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేశారు. ఎలాంటి పత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు