22వ తేదీ టెన్త్‌ పరీక్ష వాయిదా

6 Mar, 2019 02:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వచ్చే నెల 3న నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పదో తరగతి పరీక్షల విభాగం చేస్తోంది. హాల్‌టికెట్ల ముద్రణ పనులు చివరి దశకు చేరడంతో బుధవారం నుంచి పాఠశాలలకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 22న జరగాల్సిన ఆంగ్లం పేపర్‌–2 పరీక్షను వాయిదా వేసింది. 22న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల అధికారి సూచన మేరకు పరీక్ష తేదీని మార్చింది.

ఆ పరీక్షను వచ్చే నెల 3న నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రివైజ్డ్‌ టైం టేబుల్‌ను జారీ చేసి, ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. పరీక్ష ప్రతి రోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటుందని, ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయని వివరించింది. ఎస్సెస్సీ వొకేషనల్‌ థియరీ పరీక్ష మాత్రం ఉదయం 11:30 గంటలకే పూర్తవుతుందని తెలిపింది.

మరిన్ని వార్తలు