కడుపునొప్పికి తాళలేక ఓ విద్యార్థిని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామానికి చెందిన తాడి లావణ్య(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. మంగళవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. లావణ్య మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.