మెదక్: ఏటీఎంలలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను మెదక్ జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పలు చోరీలకు పాల్పడిన దొంగలు రూ.31 లక్షల నగదును కాజేశారు. వీరిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ దొంగలు గతేడాది డిసెంబర్లో నిజామాబాద్ పోలీసులపై కాల్పులు జరిపి పరారైయ్యారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.