మూగ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం

1 Jul, 2015 11:34 IST|Sakshi

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ చింతల్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మూగ బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బస్తీకి చెందిన జాఫర్‌బీ, మహ్మద్‌ల కూతురు(15) పుట్టు మూగ. రోడ్లపై బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ అమ్మాయిని జూన్ 29 రాత్రి ఆటో డ్రైవర్ జాఫర్(28) తన ఆటోలో ఎక్కించుకొని.. రాజేంద్రనగర్ శివారులోని మానస హిల్స్ వెనక భాగంలో ఉన్న నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడే ఆ అమ్మాయి పై అత్యాచారానికి పాల్పడి వదిలేసి వచ్చాడు. రాత్రి ఇంటికి చేరిన అమ్మాయి తల్లి దండ్రులకు చెప్పుకోలేక నరక యాతన అనుభవించింది. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు