శంషాబాద్‌: ఇండిగో విమానంలో విషాదం

31 Jul, 2018 19:48 IST|Sakshi

శిశువుకు తీవ్ర అస్వస్థత

విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు (రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం)లో ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగుళూరు-పట్నా ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. అత్యవసర చికిత్సనిమిత్తం చిన్నారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు