బైక్కు నిప్పంటించిన దుండగులు

6 Jan, 2016 09:56 IST|Sakshi
బైక్కు నిప్పంటించిన దుండగులు

హైదరాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హోండా షైన్ బైక్ను కాల్చేశారు. ఈ సంఘటన బషీర్ బాగ్లోని చంద్రానగర్ బస్తీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బస్తీలోని అల్లరి మూకల పనిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు.

 

 

 

మరిన్ని వార్తలు