సీఐ, ఎస్సైల సస్పెన్షన్

20 Nov, 2014 06:15 IST|Sakshi

వరంగల్: హైదరాబాద్‌లోని ఓ లాడ్జీలో పట్టుబడి వివాదాస్పదమైన కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి, వరంగల్ రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న రాత్రి హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ లాడ్జిలో ఇద్దరు పట్టుబడిన విషయం తెలిసిందే. రాజ్యలక్ష్మి భర్త సునీల్ ఈ వ్యవహారంపై పోలీసులకు ఉప్పందించారు. వెంటనే ఇద్దరినీ డీఐజీ తన కార్యాలయానికి అటాచ్ చేశారు.  
 

మరిన్ని వార్తలు