ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్‌ భేటీ

1 Dec, 2019 11:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్‌ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశ అనంతరం కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు.

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేసేందుకే  సీఎం కేసీఆర్‌ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కార్మికుల సమస్యలు ఏంటో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను నేరుగా సీఎంకే వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి తమను ఆదుకుంటానని హామీ ఇచ్చారని కార్మికులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు