పత్తి రైతు ఆత్మహత్య

28 Jan, 2016 16:40 IST|Sakshi

అప్పుల బాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుండ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లచెరువు మండలానికి చెందిన రమావత్ శివ(30) ఐదేళ్ల క్రితం రంగుండ్లకు వలస వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు