రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

29 May, 2017 12:00 IST|Sakshi
వేములవాడ: శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తుల తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు ముగుస్తుండంతో పాటు పునర్వసి నక్షత్రం కావడంతో సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం బారులుతీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు లఘుదర్శన ఏర్పాట్లు చేశారు. 
మరిన్ని వార్తలు