బెజ్జూర్‌లో ఎక్సైజ్ అధికారుల దాడులు

13 Jan, 2016 12:34 IST|Sakshi
బెజ్జూర్: ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పలుగుపెల్లి గ్రామంలోని గుడుంబా తయారీ కేంద్రాలపై బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా 4,500 లీటర్ల పానకం ధ్వంసం చేయటంతో పాటు 20 లీటర్ల గుడుంబా, ఒక బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ ఎస్సై రాజు తెలిపారు.
>
మరిన్ని వార్తలు