సీఐ బెదిరింపులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

17 May, 2016 18:47 IST|Sakshi
సీఐ బెదిరింపులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్: తమ భూమిని బలవంతంగా తీసుకునేందుకు సీఐ ప్రయత్నిస్తున్నారంటూ ఓ రైతు కుటుంబం హెచ్చార్సీని ఆశ్రయించింది.
సైబరాబాద్ సీపీ ఆనంద్ పేరు చెప్పుకుంటూ తమ 16 ఎకరాల భూమి విక్రయించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్‌మోహన్‌రెడ్డిపై పాల వెంకటయ్య అనే రైతు ఫిర్యాదు చేశాడు. సీఐ వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్ జూన్ 22 వ తేదీలోగా నివేదిక అందించాలని డీజీపీని ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు