ముందుగా రాష్ట్రంలో గవర్నర్‌ జెండావిష్కరణ

25 Jan, 2018 04:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తొలుత తెలంగాణలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించనున్నారు. అనం తరం ఆయన ఏపీలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు విజయ వాడకు బయలుదేరనున్నారు. ముందు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఉదయం 9.15 గంటలకు జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడకు బయలుదేరుతారని అధికార వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు