రాఖీ కట్టండి.. హెల్మెట్‌ ఇవ్వండి

21 Aug, 2018 09:27 IST|Sakshi

సిటీ సీపీ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరూ అక్కాచెల్లెళ్లు.. తమ అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టి హెల్మెట్‌ బహుమతిగా ఇవ్వాలని సిటీ సీపీ అంజనీకుమార్‌ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌... గిఫ్ట్‌ ఎ హెల్మెట్‌’ అవగాహన ర్యాలీని ఆయన సోమవారం కమిషనర్‌ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు జాగృతి సభ్యులను అభినందిస్తున్నానన్నారు. జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు విజయ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు