అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

14 Dec, 2015 10:54 IST|Sakshi

బస్సుల్లో తిరుగుతూ ప్రయాణికుల సూట్ కేసులు, బ్యాగుల్లో ఉన్న విలువైన వస్తువులు అపహరిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సోమవారం కోదాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న వీరంతా ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి కేజీ బంగారం, రూ1.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వీరిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు