నాటుసారా దొరకలేదని...

27 Nov, 2015 13:32 IST|Sakshi

కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో నాటుసారాకు బానిసైన ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కొత్తగూడెం మండలం సర్వారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన బిచ్చ(43) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బిచ్చ నాటుసారాకు బానిసయ్యాడు. కొన్ని రోజులుగా నాటు సారా దొరక్క పోవడంతో... మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతనిని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

 

మరిన్ని వార్తలు