ఆయన పిల్లిలా మారాడు: మందకృష్ణ

9 Nov, 2017 15:58 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : ఎస్సీ వర్గీకరణ విషయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిల్లిలా మారారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తప్పుడు ప్రకటన చేసిన మంత్రి ఈటెల తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఎస్సీ సంక్షేమ శాఖ పదవి నుంచి జగదీష్ రెడ్డిని తొలగించి ఆ శాఖ దళిత నేతకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు