వివాహిత అనుమానాస్పద మృతి

28 Feb, 2016 19:36 IST|Sakshi

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హన్‌గ్రామ్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దమ్మానంద్ భార్య నాగమణి(32) ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. కూతురి మరణవార్త విన్న ఆమె తండ్రి అక్కడికి చేరుకున్నాడు.

కూతురి మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. తండ్రి పవార్ ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు కేసు నమోదుచేసి మృతురాలి భర్త దమ్మానంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.

మరిన్ని వార్తలు