పకడ్బందీగా మెదక్ ఉప ఎన్నిక: భన్వర్‌లాల్

3 Sep, 2014 01:57 IST|Sakshi
పకడ్బందీగా మెదక్ ఉప ఎన్నిక: భన్వర్‌లాల్

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికల నిర్వహణే అత్యంత సవాలుతో కూడుకున్నదని, ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కోరారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని అమలు చేస్తామని భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్  ప్రక్రియను పరిశీలించే అవకాశాన్ని ఈసారి రాజకీయ పక్షాలకు కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు