కొనసాగుతున్న మొహర్రం ఊరేగింపు

10 Sep, 2019 15:50 IST|Sakshi

సీసీ కెమెరాలతో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలోని ప్రసిద్ధ బీబీకా ఆలం నుంచి ప్రారంభమయిన మొహ​ర్రం ఊరేగింపు కొనసాగుతోంది. డబిల్‌ పుర నుంచి చార్మినార్‌ వరుకు జరిగే ర్యాలీ సందర్భంగా పోలీసుశాఖ  పకడ్బందీ చర్యలు చేపట్టింది. భారీగా పోలీసులను మోహరించారు. పూర్తిస్థాయి భద్రతకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని సీపీ అంజనికుమార్‌ తెలిపారు. ఈ ర్యాలీ సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలో నేడు కూడా గణేష్‌ నిమజ్జనాలు జరుగుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్ని రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామని వెల్లడించారు. గణేష్‌ నిమజ్జనాల సమయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు