ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 7న బంద్

5 Mar, 2016 02:19 IST|Sakshi

మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బొట్టెంతోగు వద్ద జరిగిన దొంగ ఎదురు కాల్పులను ఖండిస్తున్నామని, దీనికి నిరసనగా ఈ నెల 7న తెలంగాణ, ఆంధ్రా దండకారణ్యవ్యాప్తంగా బంద్‌ను పాటించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ర్ట అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను ‘సాక్షి’ కార్యాలయానికి పంపారు. మార్చి 1న ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు బొట్టం గ్రామం వద్ద మావోయిస్టు దళంపై ఏకపక్షంగా కాల్పులు జరిపి, నిరాయుధులైన వారిని పట్టుకొని కాల్చి చంపారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు