ఎల్లారెడ్డిలో దారుణ హత్య

23 Oct, 2015 15:31 IST|Sakshi

ఎల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో మల్లాయిపల్లిలో పోచయ్య(55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు.

పోచయ్యకు అతని తమ్ముడు బాలయ్యతో కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. హత్య జరిగిన తర్వాత బాలయ్య కనిపించకపోవటంతో ఈ హత్య అతడే చేసి ఉంటాడని పోచయ్య కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు