'మోదీ, బాబు.. ప్రజల నోట్లో మట్టికొట్టారు' | Sakshi
Sakshi News home page

'మోదీ, బాబు.. ప్రజల నోట్లో మట్టికొట్టారు'

Published Fri, Oct 23 2015 3:25 PM

ysrcp mlas take on narendra modi, chandra babu

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ బాషా మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపన సభలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో ప్రస్తావించలేదని, విభజన చట్టం హామీలపై ఒత్తిడి తీసుకురాలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. మోదీ,  చంద్రబాబు ప్రజల నోట్లో మట్టికొట్టారని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement