నల్గొండ జిల్లాలో పీడీఎస్ బియ్యం పట్టివేత

15 Apr, 2016 07:31 IST|Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం జెగ్గుతండాలోని ఓ ఇంటిపై శుక్రవారం పౌరసరఫరాల శాఖ అధికారులు దాడి చేసి.. 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాటిని సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని.. ప్రశ్నిస్తున్నారు. సదరు ఇంట్లో పీడీఎస్ బియ్యం దాచి ఉంచారని పౌర సరఫరాల అధికారులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు చేశారు.

మరిన్ని వార్తలు