67 పోస్టులు... 16,792 మంది అభ్యర్థులు

28 Jun, 2015 21:24 IST|Sakshi
  • సింగరేణి మేనేజ్‌మెంట్ ట్రైనీ రాత పరీక్ష
  •  మూడు రోజుల తర్వాత ఫలితాలు వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీలో 67 మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఈ అండ్ ఎం) ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు ఏకంగా 16,792 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జేఎన్టీయూ-హెచ్ సౌజన్యంతో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ పట్టణాల్లోని 40 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హతలు కలిగిన 22304 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా, అందులో 16,792 మంది పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలను మూడు రోజుల్లో ఠీఠీఠీ.టఛిఛిఝజ్ఛీట.ఛిౌఝ వెబ్‌సైట్‌లో వుంచుతామని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపింది.

>
మరిన్ని వార్తలు