దళితులకు రక్షణ కరువు

27 Jul, 2017 04:14 IST|Sakshi
దళితులకు రక్షణ కరువు
ఖమ్మంలో కాంగ్రెస్‌ ఆందోళనలో భట్టి
 
సాక్షి, ఖమ్మం:  తెలంగాణలో దళితులకు రక్షణ లేకుండా పో యిందని, వారి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలో జరిగిన కలెక్టరేట్‌ ముట్టడిలో ఆయన పాల్గొన్నారు.

నేరెళ్లలో దళితులు, బీసీలపై అమానుషంగా దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. నేరెళ్లకు చెందిన దళితు లపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగం చేయడం హేయనీయమని, ఇటువంటి చర్యలకు ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.  
మరిన్ని వార్తలు