హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి కొనియాడారు. నేడు పీవీ 94 వ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్లో ఆయన మట్లాడుతూ.. పీవీ మంచి సృజనశీలి, సంస్కరణ వాది అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే ఎన్నో సృజనాత్మక నిర్ణయాలు మాజీ ప్రధాని తీసుకున్నారని చెప్పారు. ప్రపంచంలో భారతదేశం అగ్రదేశంగా నిలబడటానికి పీవీ ఆర్థిక సంస్కరణలే కారణమని ఈ సందర్భంగా రామచంద్రమూర్తి గుర్తుచేశారు.