ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

3 May, 2018 08:58 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి

పాపన్నపేట(మెదక్‌) : పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరెట్‌లో అధి కారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను ఈ వేసవి సెలవుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నిర్మాణాలు పూర్తిచేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండలాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు.  ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిం చాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం తరువాత పనులు  కొనసాగకూడదన్నారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు