వ్యక్తి అనుమానాస్పద మృతి

6 Dec, 2015 11:34 IST|Sakshi

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘనట ఆదివారం ఆదిలాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలు.. అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన అర్జయ్య(45) వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి ఆదివారం ఉదయానికి విగత జీవిగా పడి ఉన్నాడు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

మరిన్ని వార్తలు