అంబేద్కర్ చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళి | Sakshi
Sakshi News home page

అంబేద్కర్ చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళి

Published Sun, Dec 6 2015 11:33 AM

ys jaganmohah reddy pay tribute to ambedkar

హైదరాబాద్‌: భారత రాజ్యాంగ పిత, భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం లోటస్ పాండ్లో నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఇక్కడ నివాళులర్పించినవారిలో విజయసాయిరెడ్డి, వాసిరెడ్డి పద్మ కూడా ఉన్నారు.

మరోపక్క, ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వైఎసార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా తమ తమ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అమర్నాథ్ రెడ్డి, సురేశ్ బాబు, అంజద్ భాషా, మర్రి రాజశేఖర్, కౌన్సిలర్లు పార్టీనాయకులు తమతమ ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.   
 

Advertisement
Advertisement