సాక్షి, ఆదిలాబాద్: విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు వృత్తిలో భాగంగా వేరే ప్రాంతాలకు బదిలీ కావడం, లేదంటే ఉద్యోగ విరమణ పొందడం సహజం. అయితే, కేవలం మాష్టారుగానే కాకుండా.. పిల్లలతో ఓ స్నేహితుడిలా, మార్గదిర్దేశకుడిగా వ్యవహరించేవారు అరుదు. అలాంటి వారిలో బజార్ హత్నూర్ మండలం ప్రాతమిక పాఠశాల ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ ఒకరు. ఆయన నిన్న (ఫిబ్రవరి 29) పదవీ విరమణ పొందారు. శంకర్ సార్ రేపటి నుంచి పాఠశాలకు రారని తోటి ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పడంతో.. పిల్లలు ఆయనను చుట్టూచేరి వెళ్లొద్దంటూ భోరున ఏడ్చారు. విద్యార్థులు తనపట్ల చూపిన ప్రేమాభిమానాలకు ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ కన్నీరు పెట్టారు.
(చదవండి: ఉచ్చుకు చిరుత బలి)