'ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లలో ఉంచాలి'

18 Sep, 2019 14:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలందరూ చూసే విధంగా ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేరాల శేఖర్ అనే వ్యక్తి ఈ మేరకు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇప్పటివరకూ లక్షకుపైగా జీవోలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయగా అందులో 42,500 జీవోలను వెబ్‌సైట్లలో పొందుపరచలేదని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. ఈ క్రమంలో బుధవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు