జూపల్లికి కేటీఆర్‌ ఫోన్‌

25 Jan, 2020 17:12 IST|Sakshi
జూపల్లి కృష్ణారావు

సాక్షి, హైదరాబాద్‌: తాను టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో జూపల్లి వర్గం విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ అభ్యర్థుల గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌లే తమ నాయకులని స్పష్టం చేశారు. మిగతా విషయాలు అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. కాగా, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక​ అధ్యక్షుడు కేటీఆర్‌ ఫోన్‌ చేయడంతో జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌కు వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయనకు, పార్టీకి మధ్య దూరం పెరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటిదేమి లేదని తాజాగా జూపల్లి ప్రకటించారు.

చదవండి: ఫలించిన హరీష్‌ రావు వ్యూహాలు..

మరిన్ని వార్తలు