మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 వ వార్డులో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కూల్చివేతలు తక్షణమే నిలిపేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ వంటిపై కిరోసిన్ పోసుకుంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.